News September 12, 2025
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గ్రీన్లో ప్రారంభమయ్యాయి. Sensex 152 పాయింట్ల లాభంతో 81,700 వద్ద, Nifty 49 పాయింట్ల వృద్ధితో 25,054 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, మారుతీ సుజుకీ, టాటామోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్, సిప్లా, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో, SBI, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Similar News
News September 12, 2025
అప్పులు ఆంధ్రాలో మాత్రమే పెరగలేదు: బుగ్గన

ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని Way2News కాన్క్లేవ్లో వెల్లడించారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు.
News September 12, 2025
VIRAL: ‘మిరాయ్’లో ప్రభాస్ లుక్పై క్లారిటీ!

తేజా సజ్జ ‘మిరాయ్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఈ చిత్రంలో చివర్లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం SMలో జోరుగా సాగింది. చాలా మంది రాముడి లుక్లో ఉన్న ప్రభాస్ ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఇదంతా ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటో అని గ్రోక్తో పాటు సినిమా చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ మాత్రమే ఇచ్చినట్లు క్లారిటీ ఇస్తున్నారు.
News September 12, 2025
ఆర్థిక సమస్యలున్నా అందరికీ ప్రయోజనం: అనగాని

AP: రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ‘జీఎస్టీ వసూళ్లు, వృద్ధి రేటులో రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది. రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.