News April 1, 2025

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ రేపు టారిఫ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. సెన్సెక్స్ 450pts, నిఫ్టీ 100pts నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 77,400, నిఫ్టీ 23,539 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. IT, Tech రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News January 21, 2026

జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు..

image

ముంబైలోని మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలు, తిరుమల, వెల్లూర్ స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, జమ్మూ వైష్ణో దేవి క్షేత్రాలు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. కోణార్క్ సూర్య దేవాలయం, శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయాలు విశిష్ట శిల్పకళకు, భక్తికి నిలయాలు. అరుణాచల, శ్రీకాళహస్తి క్షేత్రాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

News January 21, 2026

బంగ్లాదేశ్‌పై PIL… కోర్టు సీరియస్

image

బంగ్లాదేశ్‌లో హిందువులను హింసిస్తున్నందున ఆ దేశాన్ని క్రికెట్ టోర్నమెంట్ల నుంచి నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో PIL దాఖలైంది. లా విద్యార్థి దాఖలు చేసిన దీనిపై చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ సీరియస్ అయ్యారు. ‘ఇదేం పిటిషన్. ఆ దేశం మా పరిధిలోకి వస్తుందా? మేము అక్కడికి వెళ్లి విచారించాలా? ICC మా పరిధిలోదా?’ అని ప్రశ్నించారు. హెచ్చరికతో వదిలేస్తున్నామని, సమాజంలో చేయాల్సినవి చాలా ఉన్నాయని హితవు పలికారు.

News January 21, 2026

CEOగా తప్పుకున్న దీపిందర్

image

బ్లింకిట్, జొమాటో ప్లాట్‌ఫామ్స్ పేరెంట్ కంపెనీ ‘ఎటర్నల్’ CEOగా దీపిందర్ గోయల్ తప్పుకోనున్నారు. ఈ Feb 1 నుంచి బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా ఈ బాధ్యతలు చేపట్టనుండగా, గోయల్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. ప్రస్తుత వ్యాపార పరిస్థితులకు తగ్గట్లు కొత్త మార్గాలు అన్వేషించేందుకు, అదే సమయంలో నాయకత్వ స్థాయిలో క్లియర్ ఫోకస్ ఉండేందుకే ఈ మార్పులు అని గోయల్ తెలిపారు.