News November 22, 2024

STOCK MARKETS: రూ.5లక్షల కోట్ల లాభం

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్నాయి. మధ్యాహ్నం రోజువారీ గరిష్ఠ స్థాయులకు చేరాయి. సెన్సెక్స్ 78,179 (+1019), నిఫ్టీ 23,671 (+321) వద్ద ట్రేడవుతున్నాయి. సూచీలు అనూహ్యంగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్ల మేర పెరిగింది. నిఫ్టీ50లో AXIS BANK మినహా అన్ని షేర్లూ లాభాల్లోనే ఉన్నాయి. ఉదయం నష్టపోయిన ADANIENT, SBI, ADANIPORTS ఇప్పుడు టాప్ గెయినర్స్‌గా అవతరించాయి.

Similar News

News November 12, 2025

ఆఫీసుకు 5 రోజులు రావాలన్న CEO.. 600 మంది రిజైన్

image

వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలన్న CEOకి ఉద్యోగులు షాకిచ్చారు. పారామౌంట్, స్కైడాన్స్ మీడియా విలీనం తర్వాత CEO డేవిడ్ ఎల్లిసన్ WFH చేస్తున్న వారందరూ వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించారు. లేదంటే బైఅవుట్(స్వచ్ఛందంగా వైదొలగడం) ఆఫర్ తీసుకోవాలని సూచించారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయిలో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులు ఎల్లిసన్ ఆఫర్‌ను స్వీకరించి రిజైన్ చేశారు.

News November 12, 2025

జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

image

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్‌ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్‌, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్‌ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

News November 12, 2025

RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

image

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే RCB తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్‌లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.