News July 23, 2024
నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్మార్కెట్ సూచీలు స్తబ్ధుగా ముగిశాయి. 80,724 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ ఒకానొక దశలో 1000 పాయింట్ల నష్టంతో 79,224 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత పుంజుకొని 80,766 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్ల నష్టంతో 80,429 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 24,074 వద్ద కనిష్ఠ, 24,582 వద్ద గరిష్ఠ స్థాయుల్ని తాకింది. 30 పాయింట్ల నష్టంతో 24,479 వద్ద క్లోజైంది. టైటాన్, ఐటీసీ షేర్లు 6.5% మేర ఎగిశాయి.
Similar News
News October 21, 2025
నల్లుల బెడద.. గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూత!

టెక్ దిగ్గజం గూగుల్కు అనుకోని సమస్య వచ్చింది. నల్లుల బెడదతో న్యూయార్క్లోని చెల్సియా క్యాంపస్ తాత్కాలికంగా మూతబడింది. దీంతో ఉద్యోగులు WFH చేయాలని మెయిల్ పెట్టింది. నల్లుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు రావద్దని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 19న నల్లుల నివారణ చర్యలు చేపట్టి, సోమవారం నుంచి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిచ్చింది. 2010లోనూ గూగుల్ 9th అవెన్యూ ఆఫీసులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం గమనార్హం.
News October 21, 2025
రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 5,810 NTPC పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. వయసు పోస్టులను బట్టి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పూర్తై ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News October 21, 2025
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు.