News July 23, 2024

నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

image

స్టాక్‌మార్కెట్ సూచీలు స్తబ్ధుగా ముగిశాయి. 80,724 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ ఒకానొక దశలో 1000 పాయింట్ల నష్టంతో 79,224 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత పుంజుకొని 80,766 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్ల నష్టంతో 80,429 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 24,074 వద్ద కనిష్ఠ, 24,582 వద్ద గరిష్ఠ స్థాయుల్ని తాకింది. 30 పాయింట్ల నష్టంతో 24,479 వద్ద క్లోజైంది. టైటాన్, ఐటీసీ షేర్లు 6.5% మేర ఎగిశాయి.

Similar News

News November 20, 2025

KTRకు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో KTRపై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.

News November 20, 2025

చలికి తట్టుకోలేకపోతున్నా దుప్పటి ఇప్పించండి: నటుడు

image

రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరులోని పరప్పన జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ చలికి తట్టుకోలేక జడ్జి ముందు వాపోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఆయన.. “చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనీసం అదనపు దుప్పటి ఇప్పించండి” అని కోరారు. మరో నిందితుడు నాగరాజు కూడా అదే విధంగా అభ్యర్థించాడు. జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. వెంటనే కంబళి ఇవ్వాలని ఆదేశించారు. విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేశారు.

News November 20, 2025

అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది వీరే..

image

దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వారి జాబితాలో పవన్ కుమార్ చామ్లింగ్(సిక్కిం-24 ఏళ్లు) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నవీన్ పట్నాయక్(ఒడిశా-24 ఏళ్లు), జ్యోతి బసు(పశ్చిమబెంగాల్-23 ఏళ్లు), గెగాంగ్ అపాంగ్(అరుణాచల్ ప్రదేశ్-22 ఏళ్లు), లాల్ థన్హవ్లా(మిజోరం-22 ఏళ్లు), వీరభద్ర సింగ్(హిమాచల్ ప్రదేశ్-21 ఏళ్లు), మాణిక్ సర్కార్(త్రిపుర-19 ఏళ్లు), నితీశ్ (బిహార్-19 ఏళ్లు) ఉన్నారు.