News March 6, 2025
వరుసగా రెండో రోజూ స్టాక్మార్కెట్లు అదుర్స్

స్టాక్మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,544 (+207), సెన్సెక్స్ 74,340 (+609) వద్ద ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, పాజిటివ్ సెంటిమెంటు పెరగడమే ఇందుకు కారణాలు. రియాల్టీ సూచీ తగ్గింది. O&G, మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, PSE, ఫార్మా, ఇన్ఫ్రా, హెల్త్కేర్, FMCG షేర్లు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, హిందాల్కో, BPCL, NTPC టాప్ గెయినర్స్. TECHM, BEL, ట్రెంట్ టాప్ లూజర్స్.
Similar News
News November 6, 2025
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


