News April 9, 2025

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

image

నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై టారిఫ్లను ట్రంప్ 104%కు పెంచడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 వద్ద కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ లూజర్.

Similar News

News April 18, 2025

JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

image

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

News April 18, 2025

సాక్స్‌లు వేసుకుని పడుకుంటే సుఖమైన నిద్ర!

image

రాత్రి నిద్ర సరిగా పట్టడంలేదని కొందరు, ఎక్కువ సమయం పడుకున్నా సంతృప్తి లేదని మరికొందరు బాధపడుతుంటారు. అయితే సాక్సులు వేసుకుని పడుకోవడం సుఖమైన నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పాదాలు వేడెక్కి చర్మం కింది రక్త నాళాలు మిగతా బాడీని కూల్ చేస్తాయంటున్నారు. దాంతో శరీరం నిద్రకు ఉపక్రమిస్తుందంటున్నారు. అయితే ఇన్సోమేనియా వంటి నిద్ర సంబంధిత వ్యాధులున్నవారు ట్రై చేయొద్దని సూచిస్తున్నారు.

News April 18, 2025

డ్రగ్స్ స్కామ్‌లో వైద్యుడికి 130ఏళ్ల జైలు శిక్ష

image

$2.3 మిలియన్ల డ్రగ్స్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి అమెరికాలో 130 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెన్సుల్వేనియాకు చెందిన ఆనంద్(48) మెడికేర్‌కు తప్పుడు పత్రాలు సమర్పించారని, పేషెంట్లకు నిషేధిత ట్యాబ్లెట్స్ ఇచ్చారన్న అభియోగాలపై విచారణ జరిపి యూఎస్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. 20 వేలకు పైగా ఆక్సికోడోన్ వంటి అడిక్టివ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినట్లు రుజువైందని పేర్కొంది.

error: Content is protected !!