News January 27, 2025

#stockmarketcrash: ₹9 లక్షల కోట్లు మటాష్!

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్‌కు తోడు ChatGPTకి పోటీగా చైనా ఫ్రీగా DeepSeekను తీసుకురావడంతో స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. కొలంబియాపై ట్రంప్ 25% టారిఫ్స్ విధించడం, ఆసియా సూచీలు ఎరుపెక్కడంతో భారత సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 230, సెన్సెక్స్ 800pts పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు రూ.9లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. మదుపరులు ప్రీబడ్జెట్ ర్యాలీ ఆశిస్తే మార్కెట్లేమో చుక్కలు చూపిస్తున్నాయి.

Similar News

News January 22, 2026

నైనీ కోల్ బ్లాక్ అంశం.. కేంద్ర బృందం విచారణ

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ అంశంపై కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర బృందం విచారణ జరపనుంది. ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

News January 22, 2026

రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: జగన్

image

AP: తమ వారి సంస్థలకు కారుచౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని YS జగన్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. ఒక్కో Sftకి ₹13 వేల వరకు చెల్లిస్తున్నారు. Sftకి ₹5 వేలతో ఫైవ్‌ స్టార్‌ హోటల్ నిర్మించొచ్చు. ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇస్తూ దోపిడీ చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల్లో మద్యం అక్రమ అమ్మకాలతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

News January 22, 2026

కొత్త జిల్లాల ఎత్తివేత ప్రచారంపై భట్టి క్లారిటీ

image

TG: కొత్త జిల్లాలను ఎత్తివేస్తారనే ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెరదించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు జిల్లాల రద్దు ప్రస్తావన, అలాంటి ఆలోచన కూడా లేదని కుండ బద్దలుకొట్టారు. ఇక సింగరేణి వివాదంపైనా భట్టి స్పందించారు. సంస్థ ఆస్తులు దోపిడీకి గురికాకుండా కాపాడతామని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రేపు మాట్లాడతానని వెల్లడించారు.