News April 25, 2024
జగన్పై రాళ్ల దాడి: పోలీసు అధికారులపై వేటు

AP: సీఎం జగన్పై రాళ్ల దాడి నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీ కాంతిరానా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.
Similar News
News March 7, 2026
క్యాన్సర్ను ఓడించి UPSC విజేతగా రైతు బిడ్డ

ఛత్తీస్గఢ్కు చెందిన సంజయ్ దహారియా UPSC 2025 ఫలితాల్లో 946వ ర్యాంకుతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. రైతు బిడ్డ అయిన ఆయన ఆరేళ్ల పాటు క్యాన్సర్తో పోరాడారు. ఈ క్రమంలో చూపు మందగించింది. అయినా వెనకడుగు వేయలేదు. రెండుసార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా 38 ఏళ్ల వయసులో UPSC ర్యాంకు సాధించారు. 3 ఉద్యోగాలకు రాజీనామా చేసి, అనారోగ్యాన్ని జయించి సాగించిన ఈ జర్నీ అనేక మందిని ఇన్స్పైర్ చేస్తోంది.
News March 7, 2026
ఇరాన్ ఓడిపోయింది.. ఇక బెదిరించలేదు: ట్రంప్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ <<19319891>>సారీ చెప్పడంపై<<>> అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. వేల ఏళ్ల చరిత్రలో మిడిల్ ఈస్ట్ దేశాల ముందు ఇరాన్ ఓడిపోవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇకపై పొరుగు దేశాలను అది బెదిరించలేదని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇందుకు మధ్యప్రాచ్య దేశాలన్నీ తనకు థాంక్యూ చెప్పాయన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులకు ఇరాన్ తోకముడిచి క్షమాపణ చెప్పిందని ఎద్దేవా చేశారు.
News March 7, 2026
రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్తో జరిగే T20WC ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్గా విఫలమవుతున్నారు.


