News April 25, 2024
జగన్పై రాళ్ల దాడి: పోలీసు అధికారులపై వేటు

AP: సీఎం జగన్పై రాళ్ల దాడి నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీ కాంతిరానా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.
Similar News
News March 12, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 12, 2026
అలా అయితేనే యుద్ధం ముగుస్తుంది: ఇరాన్ అధ్యక్షుడు

రష్యా, పాక్ లీడర్లతో యుద్ధ పరిస్థితులపై చర్చించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పెట్టిన షరతులకు US, ఇజ్రాయెల్ అంగీకరించాలన్నారు. ‘అంతర్జాతీయంగా ఇరాన్కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి’ అని Xలో పోస్ట్ చేశారు.


