News October 3, 2024

గడియారం గుర్తును వాడకుండా అజిత్‌ను అడ్డుకోండి: శరద్ పవార్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.

Similar News

News December 21, 2025

బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర నిరసన.. క్లారిటీ ఇచ్చిన ఇండియా

image

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర జరిగిన నిరసనలపై ఇండియా క్లారిటీ ఇచ్చింది. <<18624742>>దీపూ చంద్రదాస్<<>> హత్యను నిరసిస్తూ, బంగ్లాలో మైనారిటీల రక్షణ కోసం అక్కడ కొంతమంది నినదించారని విదేశాంగశాఖ తెలిపింది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది. బంగ్లా మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంది. బంగ్లాలో మైనారిటీలపై దాడుల పట్ల ఇండియా తన ఆందోళనను అక్కడి అధికారులకు తెలియజేసింది.

News December 21, 2025

మనం అనుకుంటేనే..

image

ఏ బంధంలోనైనా మొదట్లో ఉండే ప్రేమ తర్వాత కనిపించదు. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలో నేను అనే భావన ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఆ భావనను క్రమంగా తగ్గించుకొని మనం అనుకోవాలి. సినిమా, షాపింగ్, స్నేహితులను కలవడానికి భాగస్వామితో కలిసి వెళ్లాలి. అప్పుడే దంపతుల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. పనులెన్నున్నా రోజూ కొంత సమయం జీవితభాగస్వామి కోసం వెచ్చించాలి. కష్ట సుఖాలే కాదు, అభిరుచులు, ఆసక్తి వంటివన్నీ పంచుకోవాలి.

News December 21, 2025

ఆర్మీ అధికారి ఇంట్లో ₹2 కోట్లు.. లంచం తీసుకుంటూ దొరికిన వైనం!

image

డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్‌లో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను లంచం తీసుకుంటుండగా CBI అరెస్ట్ చేసింది. ఆయన ఇంట్లో ₹2 కోట్లకు పైగా క్యాష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావటంతో CBI రంగంలోకి దిగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఢిల్లీ, బెంగళూరులోని దీపక్ సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.