News October 3, 2024

గడియారం గుర్తును వాడకుండా అజిత్‌ను అడ్డుకోండి: శరద్ పవార్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.

Similar News

News December 14, 2025

మోదీని తొలగించడమే కాంగ్రెస్ అసలు అజెండా: బీజేపీ

image

ప్రధాని మోదీని పదవి నుంచి దింపేయడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని BJP ఆరోపించింది. ఓట్ చోరీ పేరుతో ఆ పార్టీ చేపట్టిన ర్యాలీ అసలు అజెండా ఇప్పుడు బయటపడిందని విమర్శించింది. మోదీ పాలన ముగిసిపోతుందని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంపై మండిపడింది. ‘కాంగ్రెస్ ర్యాలీ SIRకు వ్యతిరేకంగా కాదు. మోదీని పదవి నుంచి తొలగించడానికే. తమ ప్రియతమ నాయకుడిని అగౌరవపరిస్తే ప్రజలు సహించరు’ అని హెచ్చరించింది.

News December 14, 2025

15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/

News December 14, 2025

నదీజలాలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం: BRS

image

TG: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న BRSLP, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరుగుతుందని BRS వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం జలాలను కొల్లగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించింది. దీనిపై ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొంది.