News October 3, 2024
గడియారం గుర్తును వాడకుండా అజిత్ను అడ్డుకోండి: శరద్ పవార్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.
Similar News
News October 9, 2024
హనుమంత వాహనంపై మలయప్పస్వామి
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై రామావతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు గజ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు.
News October 9, 2024
ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్
సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిర్స్ట్రైక్స్ చేపట్టింది. వెపన్స్ స్మగ్లింగ్లో జోక్యం ఉన్న హై ర్యాంకింగ్ హెజ్బొల్లా టెర్రరిస్టే లక్ష్యంగా దాడి చేసినట్టు తెలిసింది. సిరియా న్యూస్ ఏజెన్సీ SANA దీనిని కన్ఫమ్ చేసింది. ఫారిన్ ఎంబసీ దగ్గర్లోని కమర్షియల్ బిల్డింగ్పై ఇజ్రాయెల్ 3 మిసైళ్లు ప్రయోగించినట్టు తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని వెల్లడించింది.
News October 9, 2024
హరియాణాలో కాంగ్రెస్కు పెరిగిన ఆదరణ
హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.