News May 10, 2024

ఇసుక అక్రమ మైనింగ్‌ను వెంటనే ఆపండి: SC

image

AP: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి పనులను ఆపాలని తెలిపింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి, తనిఖీ చేయాలని సూచించింది. కాగా అక్రమ మైనింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీన్ని ధర్మాసనం తోసిపుచ్చింది.

Similar News

News January 6, 2026

రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>EdCIL<<>> ఏపీలో 424 డిస్ట్రిక్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి JAN 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc/MA( సైకాలజీ), MSc/M.Phil సైకియాట్రిక్ సోషల్ వర్క్, MSW, BA/BSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+అలవెన్సులు(రూ.4వేలు) చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/

News January 6, 2026

సక్సెస్‌తో వచ్చే కిక్కే వేరు: CBN

image

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్‌లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.

News January 6, 2026

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

image

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‌ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్‌ (లేదా) 2mlహెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‌ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేయాలి.