News July 16, 2024
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపండి: భారత్కు అమెరికా విజ్ఞప్తి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని భారత్కు అమెరికా విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాల మధ్య శాశ్వత పరిష్కారం లభించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాలని కోరింది. భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని అమెరికా పేర్కొంది. కాగా దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా తరఫున సుమారు 50 వేల మందికిపైగా, ఉక్రెయిన్ తరఫున దాదాపు 31 వేల మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 3, 2025
చారకొండలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే బుధవారం చలి తీవ్రత కొంత తగ్గింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలంలో 17.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్లో 18.5°C, వెల్దండలో 18.6°C, కల్వకుర్తిలో 18.9°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it
News December 3, 2025
APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

APPSC ఈ క్యాలెండర్ ఇయర్లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <


