News September 27, 2024
లక్ష్యం నెరవేరేవరకూ దాడులు ఆపం: నెతన్యాహు

తమ లక్ష్యం నెరవేరే వరకూ హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణ ఆపేందుకు US ప్రతిపాదించిన 21 రోజుల కాల్పుల విరమణను ఆయన తిరస్కరించారు. ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన ప్రజలు తిరిగి వారి స్థానానికి తీసుకొస్తామని చెప్పారు. కాగా సిరియా-లెబనాన్ సరిహద్దులోని బాల్బెక్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్పై జరిపిన దాడిలో 23మంది మరణించారు.
Similar News
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.
News December 25, 2025
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

TG: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న 10.30amకు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది BAC భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే MPTC, ZPTC ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
News December 25, 2025
తగ్గేదేలే.. లీడర్స్ ON FIRE

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నాయకులు ఫైర్ మీదున్నారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంలో ఎవరూ తగ్గడం లేదు. AP సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ YCP నేతలకు <<18625628>>వార్నింగ్స్<<>> ఇస్తుండగా, జగన్ సైతం బయటకు వచ్చినప్పుడల్లా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఫైరవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ సీఎం రేవంత్, BRS చీఫ్ కేసీఆర్, KTR, హరీశ్ రావు <<18660564>>విమర్శలతో<<>> రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.


