News March 27, 2025
ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
Similar News
News January 24, 2026
ఆదివారం కూడా కరెంటు బిల్లులు కట్టొచ్చు: ఎస్.ఈ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ ఎస్.ఈ వి.రాజేశ్వరి శనివారం ఒక ప్రకటనలో కీలక సూచన చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లోని బిల్లు వసూలు కేంద్రాలు ఈ ఆదివారం పని చేస్తాయని తెలిపారు. ఇప్పటివరకు బిల్లులు చెల్లించని వారు ఈ అవకాశాన్ని సదుపాయంగా తీసుకుని బకాయిలు చెల్లించాలని కోరారు. సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎస్.ఈ స్పష్టం చేశారు.
News January 24, 2026
రథ సప్తమి రోజున ‘7’ అంకె ప్రాముఖ్యత

ప్రకృతిలో 7 అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. సప్త స్వరాలు, వారాలు, రుషులు, 7 కొండలే కాకుండా సూర్యుడి తొలి 7 కిరణాలు కూడా అంతే ముఖ్యమైనవి. అవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాణ్. ఈ ఏడు కిరణాలు ఏడు రంగులకు (VIBGYOR) మూలమని చెబుతారు. ఇవి విశ్వమంతా శక్తిని, ఆరోగ్యాన్ని నింపుతాయని శాస్త్ర వచనం. సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు కూడా ఈ కిరణాలలోని అద్భుత శక్తికి సంకేతాలే.
News January 24, 2026
600 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు స్థానిక భాషపై పట్టున్న వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofmaharashtra.bank.in/careers


