News September 16, 2024

అల్లం పంట దిగుబడికి చైనా రైతుల విచిత్ర ప్రయోగం

image

అల్లం సాగు విషయంలో చైనా రైతులు వినూత్న పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. భూమిలో అల్లం కొమ్ములతో పాటు చనిపోయిన చేపల్ని కూడా వేసి పూడుస్తున్నారు. అది కుళ్లిపోయి ఎరువుగా మారి భూమికి మంచి సారాన్నిస్తోందని, అల్లం ఘాటు కూడా బాగుంటోందని రైతులు చెబుతున్నారు. చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిల్వ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. దీంతో చైనాలో అల్లానికి సమానంగా చనిపోయిన చేపలకీ గిరాకీ ఉంటోంది.

Similar News

News December 2, 2025

లేజర్ వెపన్ ‘ఐరన్ బీమ్’ సిద్ధం చేసిన ఇజ్రాయెల్!

image

అత్యాధునిక, హైపవర్ లేజర్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ‘ఐరన్ బీమ్’ను డిసెంబర్ 30న దళాలకు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలు, క్షిపణులు, రాకెట్లు, UAVs, డ్రోన్లను భూమిపై నుంచే ఛేదించేలా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 2014లోనే ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ ఆవిష్కరించింది. కానీ 11 ఏళ్లుగా అభివృద్ధి దశలోనే ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి సైన్యానికి అందించనుంది.

News December 2, 2025

ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

image

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 2, 2025

iBOMMA రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

image

iBOMMA రవిని పోలీసులు మరో 3 కేసుల్లో అరెస్టు చేశారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే జైల్లో ఉన్న అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.