News September 16, 2024
అల్లం పంట దిగుబడికి చైనా రైతుల విచిత్ర ప్రయోగం

అల్లం సాగు విషయంలో చైనా రైతులు వినూత్న పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. భూమిలో అల్లం కొమ్ములతో పాటు చనిపోయిన చేపల్ని కూడా వేసి పూడుస్తున్నారు. అది కుళ్లిపోయి ఎరువుగా మారి భూమికి మంచి సారాన్నిస్తోందని, అల్లం ఘాటు కూడా బాగుంటోందని రైతులు చెబుతున్నారు. చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిల్వ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. దీంతో చైనాలో అల్లానికి సమానంగా చనిపోయిన చేపలకీ గిరాకీ ఉంటోంది.
Similar News
News November 17, 2025
రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందించింది. నికర పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంటుంది. సంఘం సిఫార్సులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. 2026 ఏప్రిల్1 నుంచి 5 ఏళ్లపాటు ఈ సంఘం సిఫార్సులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% STATESకు కేటాయించేలా సిఫార్సు చేసింది.
News November 17, 2025
రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందించింది. నికర పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంటుంది. సంఘం సిఫార్సులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. 2026 ఏప్రిల్1 నుంచి 5 ఏళ్లపాటు ఈ సంఘం సిఫార్సులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% STATESకు కేటాయించేలా సిఫార్సు చేసింది.
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్


