News July 19, 2024

విద్యుత్ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు: ముషారఫ్

image

విద్యుత్ అధికారులు, సిబ్బందిపై <<13660152>>దాడి<<>> చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TGSPDCL ఛైర్మన్ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. HYD మోతీనగర్‌ ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్ నిలిపేశారన్న కారణంతో మురళీధర్ అనే వ్యక్తి సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News December 15, 2025

14 గంటలు, 28 ఆర్డర్లకు రూ.762.. వైరల్

image

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన రోజువారీ సంపాదనపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒక రోజులో 28 ఆర్డర్లు డెలివరీ చేసి ఇన్సెంటివ్స్‌తో కలిపి రూ.762 సంపాదించానని తెలిపాడు. ఇందుకోసం 14 గం. కష్టపడ్డానని చెప్పాడు. అయితే ఇది చాలా తక్కువ సంపాదన అని, బ్లింకిట్ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. క్విక్ కామర్స్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని మరికొందరు అంటున్నారు. COMMENT?

News December 15, 2025

విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

image

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్‌లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు మినహాయింపు ఉంది.

News December 15, 2025

హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

image

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్‌తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్‌తో ఈ వార్త వైరలవుతోంది.