News April 24, 2024
మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు: విద్యాశాఖ

AP: టెన్త్ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకే ర్యాంకుల సంస్కృతికి ముగింపు పలికినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. స్కూళ్లు మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి పర్సనల్ ఎడ్యుకేషన్ నంబర్(PEN) కేటాయించామని చెప్పారు. దీనిద్వారా విద్యార్థి దేశంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా పాఠశాలను మారవచ్చన్నారు.
Similar News
News December 23, 2025
BREAKING: భారత్ ఘన విజయం

వైజాగ్ వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో టీ20లోనూ టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లోనే 69*(11 ఫోర్లు, ఒక సిక్సర్), జెమీమా 26, స్మృతి 14, హర్మన్ ప్రీత్ 10 రన్స్ చేశారు. ఈ గెలుపుతో భారత్ 5 టీ20ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది.
News December 23, 2025
ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే!

వ్యాయామం ఎక్కువగా చేస్తే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గుండె పనితీరుపై భారం పడి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్ట్బీట్లో మార్పులు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, పాల్పిటేషన్స్, మయోకార్డిటిస్, అలసట సమస్యలు ఎక్కువవుతాయి. తలతిరగడం, గుండె కండరాల్లో వాపు ఏర్పడే ప్రమాదం ఉంది. బీపీ పెరిగి హార్ట్ బీట్లో మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ హార్ట్ ఇష్యూస్కు దారితీసే ప్రమాదం ఉంది.
News December 23, 2025
OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


