News April 24, 2024
మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు: విద్యాశాఖ

AP: టెన్త్ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకే ర్యాంకుల సంస్కృతికి ముగింపు పలికినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. స్కూళ్లు మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి పర్సనల్ ఎడ్యుకేషన్ నంబర్(PEN) కేటాయించామని చెప్పారు. దీనిద్వారా విద్యార్థి దేశంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా పాఠశాలను మారవచ్చన్నారు.
Similar News
News December 28, 2025
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
News December 28, 2025
బంగ్లాదేశ్లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<


