News October 19, 2024

రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP

image

TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Similar News

News January 31, 2026

బడ్జెట్ 2026: వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

image

యూనియన్ బడ్జెట్ 2026పై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచారు. ముఖ్యంగా సిల్వర్‌పై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే దేశీయంగా ధరలు తగ్గి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, దిగుమతులను తగ్గించడం కోసం డ్యూటీ పెంచే అవకాశాలూ ఉన్నాయి. అటు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వాడకం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలు పారిశ్రామికంగా వెండికి మంచి బూస్ట్ ఇస్తాయి.

News January 31, 2026

‘జన నాయగన్’ వివాదంపై స్పందించిన విజయ్

image

‘జన నాయగన్’ వాయిదాపై హీరో, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తన సినిమాపై రాజకీయ ప్రభావం ఉంటుందని ముందే ఊహించానన్నారు. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నిర్మాతల గురించే బాధగా ఉందని, తన కారణంగా వాళ్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. JAN 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆలస్యంతో వాయిదా పడింది.

News January 31, 2026

పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5 లక్షల వరకు ఉచిత వైద్యం: CBN

image

AP: P4 కింద 500-700 ఫ్యామిలీలను క్లస్టర్‌గా చేస్తే మార్పు వస్తుందని CM చంద్రబాబు సూచించారు. కుప్పంలోని పీ4 బంగారు కుటుంబాలు-మార్గదర్శులతో CM భేటీ అయ్యారు. ‘కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అక్షరాస్యత పెంచాలి. రాష్ట్రంలో త్వరలోనే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5L వరకూ ఉచిత వైద్యం అందిస్తాం’ అని చెప్పారు. కుప్పంలోని 3 మండలాలను దత్తత తీసుకున్న MEIL, ADANI, TVS సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.