News October 19, 2024
రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP

TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.
News October 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 24, 2025
బిహార్ ఎన్నికల్లో యువతదే కీలకపాత్ర: మోదీ

బిహార్లో ఆర్జేడీ ఆటవిక పాలన(జంగల్ రాజ్)పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతుందని PM మోదీ అన్నారు. ప్రతిపక్షాల దురాగతాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ‘మేరా బూత్ సబ్సే మజ్ బూత్: యువ సంవాద్’ ఆడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గతంలో RJD చేసిన ఆకృత్యాలను నేటి యువతకు BJP నేతలు వివరించాలని సూచించారు. NDA పాలనలో బిహార్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.