News March 18, 2024
చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు: కలెక్టర్

చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. కలెక్టర్, ఆదివారం పోలీసు కమిషనర్ సునీల్ దత్తో కలిసి ఇల్లందు రోడ్, ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు.
Similar News
News September 5, 2025
ఖమ్మం: సదరం సర్టిఫికేట్లకు రూ.50 వేలు డిమాండ్..!

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపుల్లో అవినీతి జరుగుతోందని బాధితుడు ఫిర్యాదు చేశారు. సదరం విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శాశ్వత ధ్రువీకరణ పత్రానికి రూ.50 వేలు, ఐదేళ్ల సర్టిఫికేట్కు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు శ్రీను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్కు ఫిర్యాదు చేశారు.
News September 5, 2025
ఖమ్మం జిల్లాలో 6న వైన్స్ బంద్: సీపీ

గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై సీపీ సునీల్ దత్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్లు, క్లబ్లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 5, 2025
KMM: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

భర్త బాబాయ్ వేధింపులు భరించలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన మోషిత (24) నవీన్ను 2018లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆమె భర్తకు దూరంగా ఉంటుండగా భర్త బాబాయ్ అయిన రామకృష్ణ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.