News September 14, 2024
పటిష్ఠంగానే ‘రాజధాని’ పునాదులు?

AP: ఐదేళ్లుగా నీటిలో నానుతున్న రాజధాని అమరావతిలోని భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై, HYD IIT నిపుణులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తుప్పు పట్టిన ఇనుము తొలగించి, కెమికల్ ట్రీట్మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిపుణులు ఇటీవల రాజధాని నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే.
Similar News
News December 2, 2025
పెట్టుబడుల వరద.. 6 నెలల్లో ₹3 లక్షల కోట్లు!

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల్లో రూ.3.15 లక్షల కోట్లు($35.18B) వచ్చాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అమెరికా నుంచి వచ్చిన FDIలు రెట్టింపు కావడం గమనార్హం. ఇక FDIలను ఆకర్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ($10.57B), కర్ణాటక ($9.4B) టాప్లో ఉన్నాయి. తెలంగాణకు $1.14B పెట్టుబడులు వచ్చాయి.
News December 2, 2025
జపం చేసేటప్పుడు మధ్య వేలును ఎందుకు ఉపయోగిస్తారు?

యోగ శాస్త్రం ప్రకారం.. మధ్య వేలు నుంచి ఓ ముఖ్యమైన ప్రాణశక్తి ప్రవహిస్తుంది. జపం చేసేటప్పుడు ఈ వేలిని ఉపయోగించడం వలన మనస్సు శుద్ధి జరిగి, నాడీ వ్యవస్థ బలపడుతుంది. దీనికి మంత్ర శక్తి తోడై కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. దీని ప్రభావం మనసు చంచల స్వభావాన్ని నియంత్రిస్తుంది. అలాగే మనిషిని అంతరాత్మతో అనుసంధానం చేస్తుంది. ఫలితంగా, ఆధ్యాత్మిక బంధం బలపడుతుంది. భగవంతుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి.
News December 2, 2025
APPLY NOW: IIBFలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్(IIBF) 10 Jr ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA ఉత్తీర్ణులు అర్హులు. గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.iibf.org.in


