News January 8, 2025
కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్

AP: కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటివరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామన్నారు. ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
Similar News
News January 21, 2026
వరంగల్: మరణంలోనూ వెలుగునిచ్చారు..!

వరంగల్ చౌరస్తా ప్రాంతానికి చెందిన పుల్లూరు రామలింగం (75) మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు. బుధవారం ఉదయం ఆయన కన్నుమూయగా, వారి అభీష్టం మేరకు నేత్రాలను దానం చేశారు. వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల నిపుణులు నేత్రాలను సేకరించి, తదుపరి చికిత్స కోసం HYDలోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు తరలించారు. తమ తండ్రి నేత్రాల ద్వారా ఇద్దరు అంధులకు చూపు లభించడం గర్వకారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
News January 21, 2026
శబరిమల బంగారం చోరీ.. ప్రధాన నిందితుడికి బెయిల్

శబరిమల బంగారం చోరీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళలోని విజిలెన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 90 రోజుల్లోపు ఛార్జిషీట్ వేయడంలో SIT విఫలమైనందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్టేట్మెంట్ల ఆధారంగా విచారించాల్సి ఉన్నందున పొట్టికి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇక రాజీవరు బెయిల్పై కోర్టు గురువారం తీర్పు చెప్పనుంది.
News January 21, 2026
భయపడొద్దు పార్టీ అండగా ఉంటుంది: జగన్

AP: ప్రభుత్వ దన్నుతో కూటమి నేతలు, పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని దిగజారుస్తున్నారని YCP చీఫ్ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన సాల్మన్ కుమారులు, పార్టీనేతలు తాడేపల్లిలో జగన్ను కలిశారు. టీడీపీ నేతలు వేధిస్తున్నారని తెలిపారు. కాగా ఎవరూ భయపడొద్దని, అక్రమ కేసులపై పార్టీ లీగల్ సెల్ న్యాయసహాయం అందిస్తుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.


