News April 9, 2025

MPలో విద్యార్థుల అటెండెన్స్.. ‘జై హింద్’ అనాలి

image

మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘ప్రజెంట్ సర్/మేడమ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క్యాబినెట్ మినిస్టర్ కున్వర్ విజయ్ షా కూడా దీనిపై ప్రకటన చేసినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కాగా, హరియాణా ప్రభుత్వం కూడా విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్‌’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకుంది.

Similar News

News December 26, 2025

స్టేట్ బోర్డు నుంచి CBSEలోకి స్కూళ్ల మార్పు

image

స్టేట్ బోర్డుల పరిధిలో ఉన్న స్కూళ్లు క్రమేణా CBSEకి మళ్లుతున్నాయి. TGలో 5 ఏళ్లలో 113 స్కూళ్లు ఇలా మారాయి. అటు ఏపీలోనూ అదే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే 1000 స్కూళ్లలో CBSEని ప్రవేశపెట్టింది. NCERT సిలబస్ బోధన వల్ల JEE, NEET సహా పోటీ పరీక్షలకు మేలన్న భావనతో పేరెంట్స్‌ ఈ స్కూల్స్‌ వైపు మొగ్గుతున్నారు. దీంతో యాజమాన్యాలూ అటే మారుతున్నాయి. దేశంలో CBSE స్కూళ్లు 31879 ఉండగా APలో 1495, TGలో 690 ఉన్నాయి.

News December 26, 2025

అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

image

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.

News December 26, 2025

ఈ రాత్రి ఢిల్లీకి సీఎం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు CWC సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.