News November 14, 2024
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.
Similar News
News January 31, 2026
కేంద్ర బడ్జెట్: ఆ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్!

ఈ ఏడాది WB, TN, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రేపు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే, హైవే, పట్టణ అభివృద్ది శాఖల ద్వారా ఈ రాష్ట్రాలకు నిధులు కేటాయించొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే WB, TN, కేరళలో పలు ప్రాజెక్టులకు PM మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికి నిధులతో పాటు కొత్త ప్రాజెక్టులూ ప్రకటించవచ్చని అంటున్నారు.
News January 31, 2026
మత మార్పిడి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా: కౌశిక్ రెడ్డి

TG: కరీంనగర్ CP మతమార్పిడి చేస్తున్నట్లు తాననలేదని BRS MLA కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ‘TG IPS ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను అలా అన్నట్లు నిరూపిస్తే MLAగా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దాన్ని నిరూపించకుంటే అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో వారిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


