News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.

Similar News

News February 3, 2026

సమీకృత వ్యవసాయంలో ఈ రైతు విజయం ఆచరణీయం

image

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.

News February 3, 2026

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<>GSL<<>>) 25 ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/BSc(Engg.) అర్హత గలవారు FEB 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, DV, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://goashipyard.in

News February 3, 2026

పూజ గది: ఏ విగ్రహం ఎక్కడ ఉండాలంటే?

image

ప్రథమ పూజలందుకునే వినాయకుడు ఎప్పుడూ మధ్యలో ఉండాలి. ఆయనకు కుడివైపున కులదేవతలు, హనుమంతుడు, కుమారస్వామి దేవుళ్ల విగ్రహాలను అమర్చాలి. అమ్మవార్ల విగ్రహాలను ఎడమవైపున ఉంచాలి. సీతారాములు , లక్ష్మీనారాయణుల వంటి జంట పటాలలో అమ్మవారు స్వామికి ఎడమవైపున ఉంటే, అప్పుడు స్వామివారే ప్రధానం కాబట్టి ఆ పటాలను వినాయకుడికి కుడివైపునే ఉంచాలి. ఎడమవైపున అమ్మవారు స్వామికి సహాయకారిగా ఉంటారని శాస్త్రం చెబుతోంది.