News October 22, 2024
విద్యార్థుల ఫుట్ బోర్డు ప్రయాణం.. స్పందించిన TGSRTC

రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో కొందరు విద్యార్థులు <<14425042>>ఫుట్ బోర్డు ప్రయాణం<<>> చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని, ఫుట్ బోర్డు ప్రయాణం చేయకుండా సహకరించాలని కోరారు.
Similar News
News November 10, 2025
మెగాస్టార్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్!

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్హిట్ సాంగ్స్తో యూత్ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్లో సాంగ్ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 10, 2025
APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
News November 10, 2025
మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


