News February 28, 2025

దేశ ప్రగతి, ఆవిష్కరణల్లో విద్యార్థులదే కీ రోల్: రాజ్‌నాథ్

image

TG: వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. తాను కూడా కొన్నాళ్లు సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఆయన ప్రసంగించారు. దేశ ప్రగతి, ఆవిష్కరణల్లో విద్యార్థులదే కీలక పాత్ర అని తెలిపారు. దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులొస్తున్నాయని పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

AP న్యూస్ రౌండప్

image

*నిధుల దుర్వినియోగం కేసులో IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను మూడోసారి తిరస్కరించిన ACB కోర్టు
*నకిలీ మద్యం కేసులో చొక్కా సతీశ్ రిమాండ్‌ను NOV 25 వరకు పొడిగింపు
*మూడు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
*తన భార్య డిజిటల్ అరెస్టుకు గురయ్యారంటూ MLA పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై ఏడుగురిని అరెస్టు చేసిన కడప సైబర్ క్రైమ్ పోలీసులు

News November 17, 2025

బెల్లం.. మహిళలకు ఓ వరం

image

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్‌లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.

News November 17, 2025

శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

image

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>