News September 24, 2024
పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు!

AP: పల్నాడు(D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.
Similar News
News March 11, 2025
రేపు జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు

TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఎట్టకేలకు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కొత్తగా ఎంపికైన 1,286 మంది JLలకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. గత నెలలోనే వారికి పోస్టింగ్లు కేటాయించారు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది.
News March 11, 2025
CT విజయోత్సవం లేనట్లే!

భారత జట్టు గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చాక ముంబైలో విక్టరీ పరేడ్ చేసినట్లే CT గెలిచాకా నిర్వహిస్తారని అభిమానులు భావించారు. అయితే అలాంటి వేడుకలేమీ నిర్వహించట్లేదని తెలుస్తోంది. మార్చి 22 నుంచే ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఈ సమయంలో ఆటగాళ్లు విరామాన్ని కోరుకుంటున్నారు. దీంతో పరేడ్ నిర్వహించట్లేదని సమాచారం. మరోవైపు దుబాయ్ నుంచి ఆటగాళ్లు విడివిడిగా ఇళ్లకు చేరుకుంటున్నారు.
News March 11, 2025
నేడు గ్రూప్-2 ఫలితాలు

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.