News March 17, 2024

లండన్‌లో చదివి చిత్తూరు జిల్లాలో పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా MP, MLA అభ్యర్థుల్లో పలువురు విదేశాల్లో చదివారు. భూమన అభినయ్(తిరుపతి), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(చంద్రగిరి), మిథున్ రెడ్డి(రాజంపేట ఎంపీ) లండన్‌లో MS, MBA పూర్తి చేశారు. నిసార్ అహ్మద్(మదనపల్లె), భరత్(కుప్పం) ఇద్దరూ ఇంజినీర్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి MA PhD చేశారు. పూతలపట్టు అభ్యర్థి సునీల్ డాక్టర్. మిగిలిన అభ్యర్థులందరూ మినిమం డిగ్రీ పూర్తి చేశారు.

Similar News

News February 21, 2026

చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

image

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.

News February 21, 2026

చిత్తూరు: పోలీసుల శ్రమదానం

image

స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటారు.

News February 21, 2026

చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

image

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.