News March 20, 2024

రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్ట్రార్

image

AP: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మడకశిర సబ్ రిజిస్ట్రార్ దామోదర్ రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ రైతు తన 6.36 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. డబ్బు తీసుకునే సమయంలో దామోదర్‌తో పాటు దస్తావేజు లేఖరిని ఏసీబీ పట్టుకుంది.

Similar News

News November 2, 2025

కార్తీక పౌర్ణమి ఏరోజు జరపాలంటే?

image

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి NOV 5న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానాలకు 4:52 AM – 5:44 AM అనుకూలంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను 7:58 AM – 9:00 AM జరపాలని సూచించారు. దీపారాధనకు సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు ఉత్తమమన్నారు. పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం పెట్టి, శివకేశవులను పూజించి, ఉపవాసం ఉంటే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.☞ కార్తీక పౌర్ణమి విశేషాలు, పూజ నియమాల కోసం <<-se_10013>>భక్తి<<>>.

News November 2, 2025

అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

image

పుష్ప సినిమాలో నటనకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

News November 2, 2025

BREAKING: సుందర్ విధ్వంసం.. భారత్ విజయం

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూర్య సేన 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో సుందర్ (23 బంతుల్లో 49*), జితేశ్ శర్మ (13 బంతుల్లో 22*) మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.