News March 29, 2025
రేపు, ఎల్లుండి పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

TG: రేపు, ఎల్లుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్టేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవులను రద్దు చేసింది.
Similar News
News October 27, 2025
నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>
News October 27, 2025
శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 4 ట్రెయినీ డాక్ పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఎస్సీ నాటికల్ సైన్స్, సెకండ్ మేట్(FG)/డ్రెడ్జ్ మేట్ గ్రేడ్ 1 అర్హతగల అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. రాతపరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://smp.smportkolkata.in/
News October 27, 2025
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో రెండ్రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్న సమయంలో క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ తీవ్రంగా <<18098991>>గాయపడిన<<>> విషయం తెలిసిందే. వెంటనే మైదానాన్ని వీడగా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రిబ్స్లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని క్రీడా వర్గాలు తెలిపాయి.


