News October 24, 2025

శ్రీరామ నామ పఠనంతో విజయం తథ్యం

image

శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఆ స్వామి నామము, రూపము, గుణములు, లీలలు అన్నీ అద్భుతాలే. ఆ పరమాత్ముని వచనములు ఆదర్శ ప్రాయములు. వాటిని శ్రవణం, పఠనం, మననం చేయుట మనకు శ్రేయస్సు చేకూరుస్తుంది. ఎల్లప్పుడూ ఆ ప్రభువు రూపాన్ని, గుణాలను మనస్సులో నిలుపుకొని, ఆయన ఆదర్శములను ఆచరించిన పుణ్యాత్ములకు విజయం తథ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి సద్భాగ్యము కలిగిన మానవుడు నిజంగానే ధన్యుడు. <<-se>>#Bakthi<<>>

Similar News

News October 24, 2025

సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

image

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 24, 2025

న్యూస్ అప్డేట్స్

image

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్, క్రాస్‌ ఓటింగ్‌తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్‌లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.

News October 24, 2025

పవన్ కళ్యాణ్‌తో హైడ్రా రంగనాథ్ భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటల పాటు వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.