News January 23, 2025

ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!

image

విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.

Similar News

News January 10, 2026

భక్తి, ఎదురుచూపులకి నిదర్శనం ‘శబరి’

image

శబరి శ్రీరాముని దర్శనం కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది. వృద్ధాప్యం పైబడ్డా, కంటిచూపు మందగించినా ఆమెలో రామనామ స్మరణ తగ్గలేదు. రాముడు వస్తాడన్న ఆశతో రోజూ ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ, మధుర ఫలాలను సేకరించేది. చివరకు రాముడు రానే వచ్చాడు. ఆమె ఎంతో ప్రేమిస్తూ, రుచి చూసి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తృప్తిగా స్వీకరించాడు. శబరి నిష్కల్మష భక్తికి మెచ్చిన రాముడు, ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి పునీతురాలిని చేశాడు.

News January 10, 2026

చిరు మూవీ టికెట్ ధరలు పెంపు.. HCలో పిటిషన్

image

TG: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర‌వరప్రసాద్‌ గారు’ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్(అత్యవసర విచారణ) దాఖలైంది. దీనిపై సెలవుల తర్వాత విచారిస్తామని కోర్టు పేర్కొంది. ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతిస్తూ, రెగ్యులర్ షోల టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల <<18809035>>రాజాసాబ్<<>> టికెట్ల పెంపుపై HC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే MSVP బుకింగ్స్ మొదలయ్యాయి.

News January 10, 2026

నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

image

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.