News October 21, 2024
అలాంటి వారు ఇక నో ఫ్లై జాబితాలో: రామ్మోహన్ నాయుడు

విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా పరిగణించేలా చట్ట సవరణ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చనున్నట్టు వెల్లడించారు. ఇప్పటిదాకా 75 సంస్థలకు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేరకమైన భాషను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Similar News
News December 20, 2025
అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.
News December 20, 2025
ఎప్స్టీన్ ఫైల్స్.. వేలాది ఫొటోలు రిలీజ్

అమెరికా లైంగిక నేరగాడు ఎప్స్టీన్కు సంబంధించి US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) మూడు లక్షలకు పైగా పేజీల రికార్డులను తాజాగా విడుదల చేసింది. ఎప్స్టీన్ ప్రైవేట్ ఐల్యాండ్లో బిల్క్లింటన్, ట్రంప్, మైకేల్ జాక్సన్ వంటి ప్రముఖులతో పాటు వందల మంది అమ్మాయిలు నగ్నంగా కనిపించే చిత్రాలు అందులో ఉన్నాయి. ఓ గదిలో బిల్క్లింటన్ అమ్మాయి డ్రెస్సులో ఉన్న పెయింటింగ్ సంచలనంగా మారింది.
News December 20, 2025
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.


