News October 21, 2024
అలాంటి వారు ఇక నో ఫ్లై జాబితాలో: రామ్మోహన్ నాయుడు

విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా పరిగణించేలా చట్ట సవరణ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చనున్నట్టు వెల్లడించారు. ఇప్పటిదాకా 75 సంస్థలకు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేరకమైన భాషను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Similar News
News December 23, 2025
శివాజీ కామెంట్స్.. మంచు మనోజ్ క్షమాపణలు

హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు <<18648181>>శివాజీ చేసిన కామెంట్లు<<>> తీవ్ర నిరాశకు గురిచేశాయని మంచు మనోజ్ తెలిపారు. ‘మహిళల దుస్తుల విషయంలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తనతోనే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమే. ఆ సీనియర్ నటుడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా. మహిళలు గౌరవం, మర్యాద, సమానత్వానికి అర్హులు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News December 23, 2025
పొటాషియం వల్ల మామిడికి కలిగే ప్రయోజనాలు

మామిడిలో పండు రకం, పరిమాణాన్ని బట్టి నాణ్యతను నిర్ణయిస్తారు. మామిడిలో 1% పొటాషియం నైట్రేట్ను పూత, పిందె కట్టే సమయంలో పిచికారీ చేస్తే.. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, హార్మోన్లు సక్రమ రవాణా జరిగి పూత, పిందె రాలటం తగ్గుతుంది. అలాగే పండు బరువు, పరిమాణం, ఆకారం, రంగు, పండులో కండ, చక్కెర శాతం పెరిగి ఆమ్లత్వం తగ్గుతుంది. పండు త్వరగా పక్వస్థితికి రావడంతో పాటు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
News December 23, 2025
KCR ప్రెస్మీట్.. డిఫెన్స్లో రేవంత్ సర్కార్: హరీశ్ రావు

KCR ప్రెస్మీట్తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్లో పడిందని హరీశ్ రావు అన్నారు. ‘రాత్రి 9:30 గంటలకు CM చిట్చాట్, మంత్రులు పోటీపడి ప్రెస్మీట్లు పెట్టారంటే అదీ KCR పవర్. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో రేవంత్కు ఓటమి భయం మొదలైంది. అందుకే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టట్లేదు. అవకాశమిస్తే అసెంబ్లీలో ప్రభుత్వ బండారాన్ని బయటపెడతాం. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ఉత్తమ్, భట్టి ₹7,000Cr పంచుకున్నారు’ అని ఆరోపించారు.


