News March 19, 2025
ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి

AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, DRDO మాజీ చీఫ్ సతీశ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి సుచిత్ర, ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్గా సతీశ్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్యాబినెట్ ర్యాంకుతో రెండేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.
Similar News
News March 20, 2025
ఈసారి ఇంపాక్ట్ రూల్ ఉండాలా? వద్దా?

IPL-2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బ తీస్తోందని, ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రూల్ ప్రవేశపెట్టాక 2023లో ఒకసారి, 2024లో 8 సార్లు 250కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఒకసారి మాత్రమే (2013లో) 250+ నమోదైంది. 2024లో జట్ల రన్రేట్ 9.56గా ఉండగా 2022లో 8.54గానే ఉంది. దీనిపై మీ కామెంట్.
News March 20, 2025
ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

ఓవర్థింకింగ్కు ప్రధాన కారణం నెగిటివిటీ కనుక దానికి దూరంగా ఉండండి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని ఏ విషయమైన ఇబ్బంది పెడితే 72 గంటల పాటు దాన్ని మర్చిపోండి. తర్వాత అది మిమ్మల్ని అంతగా వేధించదు. సోషల్ మీడియా అధికంగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక దానికి దూరంగా ఉండండి. ధ్యానం చేయడంతో కంగారు తగ్గడంతో పాటు వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకుంటారు.
News March 20, 2025
6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.