News March 19, 2025

ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి

image

AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, DRDO మాజీ చీఫ్ సతీశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి సుచిత్ర, ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్‌గా సతీశ్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్యాబినెట్ ర్యాంకుతో రెండేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News November 5, 2025

APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<>PGIMER<<>>)13 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, BSc, MBBS/BDS, బీటెక్, MSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News November 5, 2025

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.

News November 5, 2025

నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

image

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.