News August 30, 2025
‘సుదర్శన చక్ర’ గేమ్ ఛేంజర్ అవుతుంది: రాజ్నాథ్

భారత్ అభివృద్ధి చేస్తున్న ‘సుదర్శన చక్ర’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షణ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వచ్చే 10yrsలో ఇది దేశానికి భద్రతనిస్తుందని చెప్పారు. ‘ఫారిన్ ఎక్విప్మెంట్పై ఇండియా డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. మిలిటరీ అప్గ్రేడ్కు, పవర్ఫుల్ ఏరో ఇంజిన్ తయారీకి ప్లాన్ చేశాం. యుద్ధాల్లో కీలకంగా మారుతున్న డ్రోన్లను దేశీయంగా అభివృద్ధి చేయడం ప్రారంభించాం’ అని తెలిపారు.
Similar News
News January 28, 2026
80 గంటల్లో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో 2019 నవంబరులో ఏర్పాటైన ’80 గంటల ప్రభుత్వం’ అజిత్ పవార్కు రాజకీయాలలో కీలక ఘట్టం. నాటకీయ పరిణామాల నడుమ అర్ధరాత్రి దేవేంద్ర ఫడణవీస్తో కలిసి Dy.CMగా పవార్ ప్రమాణం చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 80 Hrsలోనే ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆయన తిరిగి NCPకి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
News January 28, 2026
ఈయూతో డీల్.. భారత్ సాధించిన గొప్ప విజయం: US ట్రేడ్ ప్రతినిధి

ఇండియా-EU మధ్య కుదిరిన <<18973407>>ఒప్పందం<<>>పై US ట్రేడ్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ప్రశంసలు కురిపించారు. ‘డీల్లోని కొన్ని అంశాలు చదివాను. ఇండియాకు అనుకూలంగా కనిపిస్తోంది. యురోపియన్ మార్కెట్లో విస్తృత అవకాశాలు దక్కుతాయి. డీల్ అమల్లోకి వచ్చాక ఆ దేశానికి గొప్ప విజయంగా నిలవబోతోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత వర్కర్లు యూరప్కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు.
News January 28, 2026
వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.


