News October 6, 2024
ఆకస్మిక వరదలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు సమాధి

భారీ వర్షాల కారణంగా మేఘాలయలో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. సౌత్గారో హిల్స్ జిల్లాలోని గసుఆపారాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డాలు ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం కాన్రాడ్ కె సంగ్మా వారికి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 10, 2026
హోటళ్లే కాదు.. హాస్టళ్లలోనూ ఇబ్బందులే!

కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది. గ్యాస్ లేక బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే అనేక <<19341968>>హోటళ్లు<<>> మూతపడ్డాయి. ఇదే సెగ హైదరాబాద్కు తాకే ప్రమాదం ఉంది. హాస్టళ్లలోనూ వంట నిలిచిపోతే వేలాది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందిపడనున్నారు. బయట హోటళ్లు కూడా క్లోజ్ అయితే తిండి కష్టాలు తప్పవని నెటిజన్లు వాపోతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు.
News March 10, 2026
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు ఎగిసి 78,205కు చేరగా, నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 24,261 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ 30లో మహీంద్రా & మహీంద్రా (+3.67%), ఇండిగో (+3.21%), ఏషియన్ పెయింట్స్ (+3.13%), మారుతీ (+2.94%) టాప్ గెయినర్స్గా నిలిచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు కోలుకోవడం, రూపాయి విలువ మళ్లీ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.
News March 10, 2026
డ్రోన్ వ్యాపారంలోకి ట్రంప్ కుమారులు

US-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ డ్రోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్గా మారింది. మిలిటరీ అవసరాల కోసం అటానమస్ డ్రోన్లను తయారు చేసే ‘పవరస్’ సంస్థలో వీరు పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు తండ్రి యుద్ధానికి ఆదేశాలిస్తుంటే మరోవైపు కుమారులు దానికి అవసరమైన ఆయుధాల వ్యాపారంలోకి ప్రవేశించడం ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు.


