News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.
Similar News
News December 13, 2025
అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నా: స్టార్క్

మరో రెండేళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు AUS స్టార్ బౌలర్ స్టార్క్ చెప్పారు. 2027లో ENG, INDలో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడాలని ఉందని ఈ 35 ఏళ్ల క్రికెటర్ తెలిపారు. అందుకోసం శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. T20Iలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చి ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు వివరించారు. తాను అనుకుంటున్నట్లు జరుగుతుందో? లేదో? అనేది తన శరీరం స్పందించడంపై ఆధారపడి ఉంటుందన్నారు.
News December 13, 2025
బస్సుల్లో పురుషులకే టికెట్లు ఇచ్చేలా చూడండి: NMUA

AP: స్త్రీశక్తి పథకంతో RTCకి డిమాండ్ పెరిగిందని NMUA వెల్లడించింది. బస్సులు ఎక్కుతున్న మహిళలు ఎంతశాతమో తెలిసింది కాబట్టి టికెట్ ఇచ్చే విధానం మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. రద్దీ వల్ల మహిళల ఆధార్ చెక్ చేసి టికెట్ ఇవ్వడంలో కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. అందువల్ల కేవలం పురుషులకే టికెట్లు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలంది.
News December 13, 2025
పెరిగిన చలి.. వరి నారుమడి రక్షణకు చర్యలు

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.


