News March 13, 2025

త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

image

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.

Similar News

News March 13, 2025

₹2,100 చెల్లిస్తే ₹5,00,000.. నిజమిదే!

image

ప్రధానమంత్రి ముద్ర యోజనపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ₹2,100 చెల్లిస్తే ₹5,00,000 ఋణం మంజూరు చేస్తున్నట్లు ఓ నకిలీ ఆమోదిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొంది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా ఋణాలను సూక్ష్మ వ్యవస్థాపకులు/వ్యక్తులకు నేరుగా ఇవ్వదని తెలిపింది.

News March 13, 2025

మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in

News March 13, 2025

కొత్త రేషన్ కార్డులపై UPDATE

image

TG: రేషన్ కార్డులను క్యూ ఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజులో జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాటితో పాటు పాత వాటికి Qr కోడ్ ఇవ్వనుంది. 1.20 కోట్ల కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 760 మైక్రాన్స్ మందం, 85.4mm పొడవు, 54mm వెడల్పు ఉండే ఈ కార్డులపై నంబర్, కుటుంబ పెద్ద పేరు, ఫొటో, ఇతర వివరాలు ఉంటాయి. నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.

error: Content is protected !!