News November 4, 2024
తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ

AP: తనకు ప్రమాదం జరిగిందనే ప్రచారంపై విజయమ్మ స్పందించారు. ‘ఈ ప్రచారంతో నాకు తీవ్ర వేదన కలుగుతోంది. నేను ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన కారు ప్రమాదాన్ని ఇప్పుడు నా కుమారుడికి ఆపాదించి దుష్ప్రచారం చెయ్యడం జుగుప్సాకరం. నేను నా మనవడి దగ్గరకు వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు. ఇవన్నీ AP ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు’ అని ఆమె లేఖ విడుదల చేశారు.
Similar News
News November 12, 2025
తొలి టెస్టులో పంత్, జురెల్ ఆడవచ్చేమో: డస్కాటే

ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టులో పంత్, జురెల్ ఇద్దరూ ఆడే అవకాశం ఉందని IND అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనన్నారు. ఇటీవల SA-Aతో జరిగిన అనధికార టెస్టులో జురెల్ <<18235138>>రెండు సెంచరీలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కీపర్లలో ఒకరిని బ్యాటర్గా ఆడించనున్నట్లు తెలుస్తోంది. అటు ఆల్రౌండర్ నితీశ్కు ఆడే అవకాశం రాకపోవచ్చని డస్కాటే పేర్కొన్నారు.
News November 12, 2025
పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
News November 12, 2025
టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి?

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.


