News January 31, 2025
షుగర్ బాధితులూ.. ఈ సంగతి తెలుసా!

డయాబెటిస్ రోగుల్లో 40% పైగా సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి. ఆహారంపై పరిమితులు, తిన్నది ఒంటికి పట్టకపోవడం, యూరిన్ ద్వారా విటమిన్లు, మినరల్స్ వెళ్లిపోవడం, పోషకాల జీవక్రియలపై రోగ ప్రభావమే ఇందుకు కారణాలు. వీరిలో ఎక్కువగా విటమిన్ D, B12, మెగ్నీషియం, ఐరన్, జింక్ లోపం కనిపిస్తున్నాయి. డాక్టర్ల సూచన మేరకు క్వాలిటీ ఫుడ్, సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదని స్టడీస్ సూచిస్తున్నాయి.
Similar News
News October 31, 2025
దేశాన్ని విడగొట్టింది జిన్నా, సావర్కర్లే: దిగ్విజయ్ సింగ్

దేశాన్ని1947లో రెండుగా విడగొట్టింది మహ్మద్ అలీ జిన్నా (పాకిస్థాన్ ఫౌండర్), హిందూ సిద్ధాంత కర్త VD సావర్కర్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. నాడు వారిద్దరు అలా చేస్తే నేడు బీజేపీ నగరాలను, పక్కనున్న వారినీ విడదీస్తోందని దుయ్యబట్టారు. SIR పేరిట పౌరసత్వ ఆధారాలను BLOలు సేకరిస్తున్నారని మండిపడ్డారు. 4సార్లు ఓట్లేసిన వారి పేర్లను ఫిర్యాదు లేకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
News October 31, 2025
రోహిత్కు కెప్టెన్సీ ఇచ్చేయండి: ఫ్యాన్స్

హిట్మ్యాన్ రోహిత్ శర్మ తమతో కొనసాగుతారని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ మొదలుపెట్టారు. ముంబైలో కొనసాగేందుకు తిరిగి జట్టు పగ్గాలు హిట్ మ్యాన్కు అప్పగించాలని SMలో డిమాండ్ చేస్తున్నారు. ‘కేవలం రోహిత్ సారథ్యంలోనే ముంబై కప్పు కొట్టగలదు. కెప్టెన్సీతో అతనికి తగిన గౌరవం ఇవ్వాలి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
News October 31, 2025
భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో అభిషేక్, హర్షిత్ రాణా (35) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. హేజిల్వుడ్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు. గిల్ (5), శాంసన్ (2), సూర్య (1), తిలక్ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబే (4) ఫెయిల్ అయ్యారు.


