News March 28, 2024
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా సుగుణ.. నేపథ్యమిదే..

TG: ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆత్రం సుగుణకు దక్కింది. ఉట్నూర్ జడ్పీ పాఠశాలలో SAగా పని చేసిన ఆమె.. మరో 13 ఏళ్ల సర్వీసు ఉండగానే రాజకీయాలపై ఆసక్తితో ఈ నెల 12న రాజీనామా చేశారు. టీచర్ కాకముందు MPTCగా పని చేశారు. సుగుణ భర్త కూడా టీచరే. ఈమె తెలంగాణ ఉద్యమంతో పాటు ఉపాధ్యాయ, ఆదివాసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు టికెట్ దక్కడానికి కలిసివచ్చాయి.
Similar News
News February 8, 2026
SERలో 54 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రన్ రైల్వే(<
News February 8, 2026
స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. గుంటూరు, తిరుపతిలో స్కిన్లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్లో మాత్రం కేజీ రూ.270-280 ఉంది. విజయవాడ, కామారెడ్డిలోనూ రూ.270 వరకు విక్రయిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1,000 వరకు ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: రష్యాతో దోస్తీకి ముప్పు పొంచి ఉందా?

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినా.. మాస్కోతో భారత మైత్రికి ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మన రక్షణ వ్యవస్థలో ఇప్పటికీ చాలా ఆయుధాలు రష్యావే. S-400 మిస్సైల్స్, అణుశక్తి వంటి విషయాల్లో ఆ దేశమే మన నమ్మకమైన భాగస్వామి. మరోవైపు చైనాను కట్టడి చేయాలన్నా మనకు పుతిన్ సహకారం చాలా కీలకం. అటు అమెరికా టెక్నాలజీని, ఇటు రష్యా నమ్మకాన్ని భారత్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.


