News June 30, 2024

ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి

image

నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌లు మారణహోమం సృష్టిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, అంత్యక్రియలు, ఆసుపత్రులు.. ఇలా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా మహిళా సూసైడ్ బాంబర్లను ప్రయోగిస్తున్నాయి. తాజాగా బోర్నో రాష్ట్రంలోని గ్వోజాలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 18మంది మరణించారు. వీరిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారు. కాగా బోర్నో రాష్ట్రం బోకోహారం మిలిటెంట్ గ్రూప్‌కు కంచుకోటగా మారింది.

Similar News

News October 31, 2025

ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?

image

ధ్వజం అంటే పతాకం. ధ్వజస్తంభం ఉత్సవానికి సంకేతం. హైందవ సంస్కృతిలో దీని చుట్టూ ప్రదక్షిణ చేశాకే దైవదర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఆలయోత్సవాలు మొదలయ్యేటప్పుడు ఈ స్తంభంపై జయపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభం లేని ఆలయాలకు స్వాములు దేవాలయ గుర్తింపు ఇవ్వరనే నమ్మకం ఉంది. దీనిని ఆలయ హృదయంగా భావిస్తారు. ఇది భక్తులకు శక్తిని, శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠిస్తారు.

News October 31, 2025

ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

image

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.

News October 31, 2025

ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

image

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.