News November 24, 2024

ప్రయాణికులున్న RTC బస్సులో ఉరేసుకొని ఆత్మహత్య

image

AP: తిరుపతి జిల్లాలోని ఏర్పేడులో ఓ వ్యక్తి RTC బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేర్లపాక వద్ద బస్సు ఎక్కిన యువకుడు బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉండటంతో వెనుకవైపు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న తాడుతో బస్సులోనే ఉరివేసుకున్నాడు. ఏర్పేడు వద్ద కండక్టర్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

image

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.

News November 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

image

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 21, 2025

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

image

AP: టెన్త్ <>ఎగ్జామ్ షెడ్యూల్<<>> విడుదలైంది. 2026 MAR 16 నుంచి APR 1 వరకు జరగనున్నాయి. MAR 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 1న SSC ఒకేషనల్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఉ.9.30 గంటల నుంచి మ.12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.