News August 29, 2024

జనాభా పెరుగుదల రేటు కన్నా ఆత్మహత్యల రేటు అధికం: రిపోర్ట్

image

భారత్‌లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా స్టూడెంట్స్ సూసైడ్ రేటు ఎక్కువగా ఉన్నట్లు NCRB నివేదిక వెల్లడించింది. 2 దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు 4% పెరిగినట్లు పేర్కొంది. MH, తమిళనాడు, MPలోనే ఈ సంఖ్య అత్యధికమని తెలిపింది. మానసిక పరిస్థితులు ఇతర అంశాలు కారణాలుగా ఉన్నాయంది. నియంత్రణకు విద్యార్థులకు కాలేజీల్లో క్రమబద్దమైన కౌన్సెలింగ్ వ్యవస్థను రూపొందించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News September 16, 2025

మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

image

MPలోని ఇండోర్‌లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్‌గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.

News September 16, 2025

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

image

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్‌కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

News September 16, 2025

ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

image

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్‌ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్‌ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.