News October 23, 2025

సేంద్రియ సేద్యానికి అనుకూలం.. BPT 2841 వరి రకం

image

BPT 2841 అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ నల్ల బియ్యపు రకం. అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలను కలిగి ఉంటుంది. భోజనానికి అనుకూలం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. ఎకరాకు సగటున 2.4 టన్నుల దిగుబడినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.

Similar News

News October 23, 2025

రాష్ట్రానికి తుఫాను/వాయుగుండం ముప్పు?

image

AP: అక్టోబర్ 27 నుంచి 30 మధ్యలో తుఫాను లేదా వాయుగుండం కావలి-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 23, 2025

ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు జారీ

image

AP: 51 లక్షల టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు నూటికి నూరుశాతం మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ-పంట డేటా ప్రకారం ముందే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్దేశించింది. ఏ మిల్లుకు ధాన్యం పంపాలనే స్వేచ్ఛను రైతులకు కల్పించింది. ఖరీఫ్ ధాన్యం క్వింటాకు సాధారణ రకానికి రూ.2369, గ్రేడ్-A రకానికి రూ.2,389 మద్దతు ధర కల్పించింది.

News October 23, 2025

నెలసరిలో ఏం తినాలంటే..?

image

చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజ, ఆప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.