News June 30, 2024

మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్

image

మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ IAS సుజాతా సౌనిక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈమె హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో CSగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Similar News

News January 21, 2026

ఎక్కువ కాలం జీవించాలంటే ఇలా చేయండి!

image

మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అతిగా ఆందోళన చెందడం, నెగటివ్ ఆలోచనల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇది త్వరగా రోగాల బారిన పడేలా చేస్తుందని, అందుకే ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. SHARE IT

News January 21, 2026

ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

image

TG: ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా తొలి కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి(D) గాగిల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగినట్లు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో బాధితుడి ఇంటికి వెళ్లి FIR నమోదు చేశామన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, పోక్సో, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బాల్య వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో బాధితుల ఇంటి వద్దే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

News January 21, 2026

భారత్‌లో ఆడండి.. లేదంటే బయటకు వెళ్లండి: ICC

image

బంగ్లాదేశ్ జట్టు T20 వరల్డ్ కప్ మ్యాచులను భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. తటస్థ వేదికలో ఆడతామన్న BCB వినతిపై ఇవాళ ICC ఓటింగ్ నిర్వహించగా, 14-2తో రిజెక్ట్ అయింది. దీంతో రేపటి లోపు తమ నిర్ణయం చెప్పాలని BCBకి అల్టిమేటం ఇచ్చింది. నో చెబితే మరో జట్టుతో రిప్లేస్ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ బంగ్లా రాకపోతే క్వాలిఫయర్స్ మ్యాచుల పాయింట్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఛాన్స్ ఎక్కువ ఉంది.