News December 25, 2024

మరోసారి కిమ్స్‌కు వెళ్లనున్న సుకుమార్, దిల్ రాజు?

image

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, దిల్ రాజుతో కలిసి ఇవాళ మరోసారి పరామర్శిస్తారని తెలుస్తోంది. మ.2 గంటలకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై బాలుడి తండ్రి భాస్కర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవతి భర్తకు దిల్ రాజు ఉద్యోగ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News December 11, 2025

IPL మినీ వేలం.. తొలి సెట్ ఇదే..

image

ఈ నెల 16న అబుదాబీలో IPL మినీ వేలం జరగనుంది. తొలి సెట్లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో డెవాన్ కాన్వే, జాక్ ఫ్రేజర్, కామెరూన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా ఉన్నారు. సర్ఫరాజ్, పృథ్వీ షా ధరను రూ.75లక్షలుగా, మిగతా వారి బేస్ ప్రైజ్‌ను రూ.2కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ వేలంలో గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలంటున్నాయి.

News December 11, 2025

రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం

image

AP: రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాలు నిర్మాణానికి ఓకే చెప్పింది. గవర్నర్ ఆఫీస్, స్టాఫ్ క్వార్టర్స్, అతిథిగృహాల నిర్మాణానికి అంగీకారం లభించింది. 26 సంస్థలకు సంబంధించిన రూ.20 వేల కోట్ల పెట్టుబడులను క్యాబినెట్ ఆమోదించింది.

News December 11, 2025

చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

image

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.