News November 17, 2024
‘పుష్ప 2’ ఈవెంట్కు సుకుమార్ దూరం.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంఛ్ రేపు పట్నాలో జరగనుంది. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటంతో వాటిని ఫినిష్ చేసేందుకు ఆయన హైదరాబాద్లోనే ఉంటారని సమాచారం. మరోవైపు రేపటి ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ అక్షర్ సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వచ్చే నెల 5న మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News December 20, 2025
మల్లన్న భక్తులకు ఊరట

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్లో ఎక్కువగా వెళ్తున్నారు.
News December 20, 2025
వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.
News December 20, 2025
సన్న బియ్యం బోనస్ జమ కాకపోతే ఏం చేయాలి?

TG: వరి సన్నాలు సాగు చేసిన రైతుల అకౌంట్లలో సర్కారు బోనస్ జమ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే బోనస్ పడుతుంది. ఒకవేళ రైతు ఖాతాల్లో బోనస్ జమ కాకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలి. పౌరసరఫరాలశాఖ వెబ్సైట్లోని ‘ఫార్మర్ కార్నర్’లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ను సంప్రదించాలి.


