News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Similar News

News November 25, 2025

నక్కపల్లి: పెన్సిల్ ముల్లుపై అయ్యప్ప స్వామి

image

నక్కపల్లిలోని చిన్న దొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై అయ్యప్ప స్వామి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. చార్కోల్ పెన్సిల్ ముల్లుపై 16 మి.మీ పొడవు, 8మి.మీ వెడల్పున అయ్యప్ప స్వామిని తయారు చేశారు. తయారు చేసేందుకు తనకు 6 గంటల సమయం పట్టిందని వెంకటేశ్ తెలిపారు.

News November 25, 2025

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

image

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

News November 25, 2025

Way2News వార్తకు రెస్పాన్స్: యూనివర్సిటీలో భవనం ప్రారంభం

image

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో నిరుపయోగంగా భవనం దర్శనమిస్తోంది. దీనిపై అక్టోబర్ 24న ‘ఈ భవనాన్ని వినియోగంలోకి <<18091663>>తేవాలి<<>>’ అనే శీర్షికతో Way2Newsలో వార్త ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు. భవంతిని వాడుకలో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు ప్రారంభానికి పలువురి ప్రజాప్రతినిధులకు ఆహ్వానమిచ్చారు. రూ.34 కోట్లతో నిర్మితమైన భవనాన్ని క్లాస్ రూంలు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు.