News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Similar News

News March 21, 2025

MBNR: టెన్త్ విద్యార్థులు.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు ఏవైనా సూచనలు, సందేహాలు ఉంటే MBNR-98487 57542,93908 11476, NGKL-94406 48324,98850 17701 టోల్ ఫ్రీ నంబర్లు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్‌పై బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ సూచిస్తుందని అధికారులు తెలిపారు.

News March 21, 2025

సిద్దిపేట: బాలికపై అత్యాచారం

image

సిద్దిపేట జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగింది. ఎస్సై విజయ్ వివరాలిలా.. ములుగు మండలానికి చెందిన బాలిక తల్లి చనిపోగా తండ్రితో ఉంటుంది. వరుసకు బాబాయి అయిన స్వామి(40) బాలికకు చాక్ లేట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం తెలుసున్న స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. బాలికను గజ్వేల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2025

జీవనోపాధికి వెళ్లి కువైట్‌లో గుండెపోటుతో మృతి

image

జీవనోపాధికి కువైట్ వెళ్లిన సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్ (34) ఈ నెల 18న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 19న కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022లో కారు డ్రైవర్‌గా పని చేసేందుకు సాగర్ కువైట్ వెళ్లారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ గత ఏడాది జులైలో కువైట్ వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

error: Content is protected !!