News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

image

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

సంగారెడ్డి: ’30లోగా నమోదు చేసుకోవాలి’

image

జిల్లాలోని వ్యవసాయ రైతులు తమ పంటల వివరాలను 30వ తేదీలోగా ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆన్లైన్‌లో నమోదు చేసుకుంటేనే సీసీఐలో అమ్మడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని అన్నారు. కావున రైతులందరూ తమ పట్టా పాసు బుక్‌ను తీసుకొని ఆయా మండలాల వ్యవసాయ అధికారులను కలవాలని కోరారు.

News September 14, 2025

భద్రాద్రి జిల్లాలో లోక్ అదాలత్‌.. 4,576 కేసుల పరిష్కారం

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 4,576 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడెంలో సివిల్ కేసులు 32, క్రిమినల్ కేసులు 2,023, బ్యాంకు కేసులు 278, ఇల్లందులో సివిల్ కేసులు 12, క్రిమినల్ కేసులు 363, పీఎల్‌సీ కేసుల 132, భద్రాచలంలో క్రిమినల్ కేసులు 1,106, పీఎల్‌సీ కేసులు 74, మణుగూరులో క్రిమినల్ కేసులు 489, పీఎల్‌సీ కేసులు 67 పరిష్కారం అయ్యాయన్నారు.

.