News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Similar News

News March 3, 2025

HYD: 18 ఏళ్లు నిండకముందే పెళ్లి పీటల పైకి..!

image

HYD, RR,MDCL జిల్లాలో 18 ఏళ్లు నిండకముందే బాలికలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని తల్లిదండ్రులు ఉన్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారికి శాపంగా మారుతుంది. మేడ్చల్లో 54, HYDలో 46, రంగారెడ్డిలో 54 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.

News March 3, 2025

నేరాలపై సైబరాబాద్ పోలీసులు ఫోకస్

image

CYB కమిషనరేట్‌ పరిధి 510 ప్రాంతాల్లో శనివారం DCPల ఆధ్వర్యంలో రైడ్స్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న 380 మందిని అదుపులోకి తీసుకోగా.. గంజాయి తాగుతున్న14 మందిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులు 1, వ్యభిచారం 26, నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై2, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగిన ఘటనలో 15 కేసులు, న్యూసెన్స్ 57, నంబర్ ప్లేట్ లేని 18 వాహనాలపై కేసులు నమోదు కాగా 4 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు.

News March 3, 2025

రంగారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా.!

image

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేడు మోయినాబాద్లో 39.2℃, తలకొండపల్లి 39.0, ఫరూక్‌నగర్ 39.0, ఇబ్రహీంపట్నం 38.8, షాబాద్ 38.7, మహేశ్వరం 38.4, హయత్‌నగర్ 38.0, శంకర్‌పల్లి 38, శేరిలింగంపల్లి 37.9, కందుకూర్ 37.9, కొత్తూర్, సారూర్‌నగర్, కేశంపేట 37.2, రాజేంద్రనగర్ 36.9, కడ్తాల్ 36.7, చేవెళ్ల 36.7, శంషాబాద్ 36.6, నందిగామ 36.4, కొందుర్గ్ 36.4, తాల్లపల్లి 36.3, యాచారంలో 36.1℃గా నమోదైంది. 

error: Content is protected !!