News March 18, 2025

సునీత.. మీరు భారత్ రావాలి: ప్రధాని మోదీ

image

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు PM మోదీ లేఖ రాశారు. తొలుత భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్నా ఎప్పుడూ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. తానెప్పుడు బైడెన్, ట్రంప్‌ను కలిసినా సునీత బాగోగుల గురించి అడిగినట్లు తెలిపారు. భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత భారత్‌ సందర్శనకు రావాలని కోరారు. తనకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తామని మోదీ తెలిపారు.

Similar News

News January 24, 2026

డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

image

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.

News January 24, 2026

IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

image

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<>IREL<<>>) 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, BCom, BSc, MBA, PG, డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు NATS/NAPS పోర్టల్‌లో మార్చి 15వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.irel.co.in/

News January 24, 2026

రథసప్తమి నాడు అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే..?

image

సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అర్ఘ్యం. రథసప్తమి నాడు రాగి పాత్రలోని శుద్ధ జలంలో ఎర్ర పూలు, రక్తచందనం, అక్షతలు కలిపి సూర్యునికి నమస్కరించాలి. శివపురాణంలోని మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడని నమ్మకం. ఇలా అర్ఘ్య ప్రదానం చేస్తే ఆయురారోగ్యాలు, కంటి చూపు మెరుగుపడి విశేష తేజస్సు లభిస్తుందని మన శాస్త్రం చెబుతోంది.